News February 27, 2025
సూర్యాపేట: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్లోని సూర్యాపేట, కోదాడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
Similar News
News March 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గాం 39.8℃ నమోదు కాగా ముత్తారం 39.7, రామగిరి 39.6, ఓదెల 39.6, కాల్వ శ్రీరాంపూర్ 39.5, సుల్తానాబాద్ 39.3, పాలకుర్తి 38.9, మంథని 38.6, ధర్మారం 38.5, కమాన్పూర్ 38.4, రామగుండం 38.3, పెద్దపల్లి 38.1, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.9℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.
News March 27, 2025
బైక్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. నేరుగా A/Cకి డబ్బులు!

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ రైడింగ్, క్యాబ్ బుకింగ్ కంపెనీల ఆధిపత్యానికి ఇక గండి పడనుంది. వీరికి అధిక కమిషన్లు చెల్లిస్తూ నష్టపోతున్న డ్రైవర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. మధ్యవర్తులు లేకుండా వారు నేరుగా లబ్ధి పొందేలా త్వరలో ‘సహకార ట్యాక్సీ’ యాప్ను తీసుకొస్తామని లోక్సభలో సహకార మంత్రి అమిత్షా ప్రకటించారు. ఇందులో బైకులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్వీలర్స్ను సహకార సంస్థలే నమోదు చేస్తాయి.
News March 27, 2025
గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్పర్సన్ తెలిపారు.