News March 21, 2024
సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికను బంధించి అత్యాచారం చేసిన వ్యక్తికి రాజేంద్రనగర్లోని ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష వేసింది. జడ్జి ఆంజనేయులు తీర్పు వెలువరించారు. హుజూర్నగర్కు చెందిన బాలిక కుటుంబం గచ్చిబౌలి వినాయకనగర్లో ఉంటోంది. బాలికపై అక్కడే నివసించే శివకృష్ణ కన్ను పడింది. 2014 అక్టోబర్ 20న ఇంట్లో నిద్రిస్తున్న బాలికను శివకృష్ణ కిడ్నాప్ చేసిన అత్యాచారం చేశారు. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News October 25, 2025
అక్టోబర్ 30 నుంచి టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు: డీఈఓ

మార్చి 2026లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు వివరాలను డీఈఓ బొల్లారం భిక్షపతి వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ. 110 చొప్పున అక్టోబరు 30 నుంచి నవంబరు 13వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 29, రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500ల అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News October 24, 2025
పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.
News October 24, 2025
ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


