News January 29, 2025
సూర్యాపేట: బావమరుదులే చంపారు!

సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన <<15277486>>పరువు హత్య<<>> కేసులో బావమరుదలే బావను చంపారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తమ సోదరి కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని భావించిన ఆమె సోదరులు ప్లాన్ ప్రకారం కృష్ణను హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు మృతదేహాన్ని కారులో వేసుకొని 100 కిమీ వెళ్లారని, మళ్లీ తీసుకొచ్చి తన చెల్లి ఇంటి సమీపంలో వేసి లొంగిపోయారన్నారు.
Similar News
News October 23, 2025
రేవంత్ రెడ్డికి సోనియమ్మ తప్ప.. తెలంగాణ సోయి లేదు: కవిత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియమ్మ తప్ప, తెలంగాణ సోయిలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. VOA ల సమస్యలను తీర్చాలంటూ ఇందిరా పార్కులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో VOA లకు రూ.26 వేల జీతం పెంచుతామని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి మర్చిపోయాడని అన్నారు. సోనియమ్మ కాదు జీతాలు పెంచాలంటూ ధర్నా చేస్తున్న ఈ తల్లులను చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్లో రౌడీషీటర్ను ఓడించండి: KCR

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని BRS చీఫ్ KCR పేర్కొన్నారు. ‘భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి HYDలో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు KCR దిశా నిర్దేశం చేశారు.
News October 23, 2025
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించండి: కలెక్టర్

కర్నూలు నగర ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని సంబంధింత అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. గురువారం సాయంత్రం కర్నూలు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ట్యాంక్ స్థితి, నీటి నిల్వను సమీక్షించారు. సమ్మర్ సిద్ధతలను దృఢంగా క్రమబద్ధం చేయాలని ఆదేశించారు. తక్షణ మరమ్మతులు, రక్షణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టేలా సూచించారు. తాగునీటి సరఫరా సురక్షితం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.