News March 23, 2025

సూర్యాపేట: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు యాకుబ్ కాగా అతనిది ఏపీ రాష్ట్రమని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News December 1, 2025

ఉమ్మడి నల్గొండలో పార్టీ బలోపేతంపై BJP ఫోకస్..!

image

తెలంగాణలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లాల ఇన్‌ఛార్జ్‌లను కొత్తగా నియమించారు. జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు చేసి, గ్రౌండ్‌లో కార్యకర్తలతో అనుసంధానం, పంచాయతీ ఎన్నికల వేళ దూకుడు పెంచాలని పార్టీ భావిస్తోంది. నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉదయ్‌ను నియమించగా, సూర్యాపేటకు టీ.రమేశ్, యాదాద్రి భువనగిరికి శ్రీనివాసరెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

News December 1, 2025

అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

image

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.

News December 1, 2025

BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

image

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.