News March 29, 2024
సూర్యాపేట: మంత్రి కారును తనిఖీ చేసిన పోలీసులు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రకారం వాహనాల తనిఖీల్లో భాగంగా సూర్యాపేటలో కేంద్ర పోలీసు బలగాలు సూర్యాపేట పోలీసులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కారును జాతీయ రహదారిపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువులు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలు ప్రకారం ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వాహనం తనిఖీ అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తిరిగి ప్రయాణమయ్యారు.
Similar News
News April 22, 2025
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 22, 2025
NLG: టార్పాలిన్లు లేక రైతన్నల పాట్లు

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
News April 22, 2025
భూ సమస్యలు తీర్చేందుకే భూ భారతి: కలెక్టర్ ఇలా

రైతుల భూ సమస్యలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం-2025 తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం ఆమె గుండ్లపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూ భారతిపై అవగాహన కల్పించారు. భూ భారతిలో భూములకు సంబంధించి సవరణలు చేసే అవకాశం ఉందన్నారు.