News February 3, 2025

సూర్యాపేట: మూడున్నర కిలోల మొరంగడ్డ 

image

సాధారణంగా ఒక మొరంగడ్డ 200, 300 గ్రాములుంటుంది. కానీ చిలుకూరులో మాత్రం ఓ రైతు చేనులో కాసిన మొరంగడ్డ ఏకంగా మూడున్నర కిలోలు ఉంది. గ్రామానికి చెందిన అలసకాని వెంకటయ్య పొలంలో బావిగడ్డకు సెప్టెంబర్‌లో మొరంగడ్డ తీగను నాటాడు. నాలుగు నెలల తర్వాత బావి గడ్డను తవ్వగా మూడున్నర కిలోల మొరంగడ్డ వచ్చిందని చెప్పారు. దానిని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. 

Similar News

News April 19, 2026

US ఆర్మీని ఓడించడానికి సిద్ధం: మొజ్తబా

image

ఇరాన్-అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే <<19685626>>రెచ్చగొట్టే<<>> పనిలో ఇరు దేశాల నాయకులు ఉన్నారు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US ఇప్పటికీ దిగ్బంధిస్తుండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ మళ్లీ <<19682480>>మూసేసిన<<>> విషయం తెలిసిందే.

News April 19, 2026

సిరిసిల్ల: మద్యం సేవించి వాహనం నడిపితే శిక్ష తప్పదు

image

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. మద్యం సేవించిన 18 మందికి జైలు శిక్ష పడిందని వివరించారు. 9 మందికి ఒక్కొక్కరికి రూ.4 వేల జరిమానా ఒకరోజు జైలు శిక్ష, ఏడుగురుకి రూ.5 వేల జరిమానా 2 రోజుల జైలు శిక్ష, ఇద్దరికీ 3 రోజుల జైలు శిక్ష రూ.5 వేల జరిమానా, ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా పడిందన్నారు.

News April 19, 2026

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని అధికారులకు సూచించారు.