News March 16, 2025
సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ సీఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
సూర్యాపేట: ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి: ఎస్పీ

ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసు ప్రజా భరోసాలో భాగంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రావీణ్యం ఉన్న అంశాలపై సాధన చేయాలని, చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనదన్నారు. అనంతరం డ్రగ్స్, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.
News October 15, 2025
గద్వాల: ‘గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలి’

గద్వాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరించాలని సీపీఎం గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, కమిటీ సభ్యులు నరసింహ పేర్కొన్నారు. ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై సర్వే నిర్వహించారు. సర్వేలో పేర్కొన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎలక్ట్రిసిటీ ఎస్సీకి వివరించి పరిష్కరించాలన్నారు. ఉప్పేరు నరసింహ పాల్గొన్నారు.
News October 15, 2025
ధాన్యం సేకరణ ప్రక్రియపై గద్వాల కలెక్టర్ సమీక్ష

ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు.