News April 5, 2024
సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ మృతి

సూర్యాపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సరిత మృతి చెందారు. ఆటోలో ఉన్న లావణ్య, పావని అనే మరో ఇద్దరు టీచర్ల పరస్థితి విషమంగా ఉంది. వీరిలో లావణ్యను మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. వారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News November 29, 2025
హైదరాబాదులో గుండ్లపల్లి మండల వాసి ఆత్మహత్య

నిరుద్యోగం, ఆర్థిక సమస్యలతో నల్గొండ(D) గుండ్లపల్లి(M) తవక్లాపూర్కు చెందిన ఆంజనేయులు(27) హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కోసం 8 నెలల క్రితం LBనగర్కు వెళ్లాడు. శుక్రవారం మ.1:10కి బంధువు అనిల్కు చనిపోతానని ఫోన్లో చెప్పాడు. విషయాన్ని వెంటనే సోదరుడు అభినందన్కు తెలియజేయగా అతను వెళ్లి చూసేసరికి ఉరేసుకొని కనిపించాడు. అతని సోదరుడు ఫిర్యాదు చేశాడని LBనగర్ సీఐ వినోద్ తెలిపారు.
News November 28, 2025
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్
News November 28, 2025
దేవరకొండకు సీఎం రేవంత్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 6వ తేదీన జిల్లాలోని దేవరకొండకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమీక్షించారు.


