News February 27, 2025

సూర్యాపేట: వచ్చే ఏడాది ట్యాబ్‌ల ద్వారా టీచింగ్

image

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే సెలెక్ట్ చేసిన పాఠశాలలకు కంప్యూటర్ల సరఫరా ప్రారంభించగా త్వరలో ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లను అందించనున్నారు. ఈ లెక్కన ఎంపికైన 22 స్కూళ్లకు 550 ట్యాబ్‌లను సరఫరా చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటి ద్వారా బోధించనున్నారు.

Similar News

News October 14, 2025

ఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటేనే WC జట్టులో RO-KO: రవిశాస్త్రి

image

2027 WCలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

News October 14, 2025

వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

image

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

News October 14, 2025

సిర్పూర్ టీ: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

మద్యానికి బానిసై పురుగు మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ వివరాలు.. మండలంలోని మాకిడి గ్రామానికి చెందిన తంగే బాలాజీ మద్యానికి బానిసై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.