News March 28, 2025
సూర్యాపేట: సన్నబియ్యానికి రూ.857.76 కోట్ల ఖర్చు

ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో సన్నబియ్యం కోసం ప్రభుత్వం రూ.857.76 కోట్లను ఖర్చు పెట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కొత్త కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాలో 4,66,522.. సూర్యాపేట జిల్లాలో 3,05, 564.. యాదాద్రి జిల్లాలో 2,17,072 రేషన్ కార్డులున్నాయి.
Similar News
News December 13, 2025
ఒకే బిల్వ పత్రంతో ఎన్నిసార్లైన పూజ చేయవచ్చా?

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగంపై ఒకసారి సమర్పించిన పత్రాన్ని శుద్ధి చేసి, మళ్లీ పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో ఒక్క దళం సమర్పించినా కూడా చాలు. అది ఎంతో పవిత్రమైనది. పూజకు ప్రతిసారి కొత్త పత్రాన్నే సమర్పించాల్సిన నియమం లేదు. అదే పత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల పూజారాధన ఫలితం ఏమాత్రం తగ్గిపోదు’ అని అంటున్నారు.
News December 13, 2025
లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 13, 2025
నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.


