News March 28, 2025
సూర్యాపేట: సన్నబియ్యానికి రూ.857.76 కోట్ల ఖర్చు

ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో సన్నబియ్యం కోసం ప్రభుత్వం రూ.857.76 కోట్లను ఖర్చు పెట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కొత్త కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాలో 4,66,522.. సూర్యాపేట జిల్లాలో 3,05, 564.. యాదాద్రి జిల్లాలో 2,17,072 రేషన్ కార్డులున్నాయి.
Similar News
News December 8, 2025
బెళుగుప్ప: బైక్లు ఢీకొని ఒకరి మృతి

బెలుగుప్ప – వెంకటాద్రి పల్లి గ్రామాల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వెంకటాద్రిపల్లికి చెందిన చంద్రమౌళి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి (63) మృతి చెందగా, తిప్పే స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్కు బీజేపీ మద్దతు

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
News December 8, 2025
కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు. పోలింగ్ అధికారులను (పీవో) 1255 మందిని, ఇతర పోలింగ్ అధికారులను (ఓపివో) 1773 మందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.


