News February 15, 2025

సూర్యాపేట: సీఎం రేవంత్ రెడ్డికి ఈ-మెయిల్

image

రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులపై ,జడ్జీలపై, కక్షిదారులపై దాడులు జరగకుండా ఒక గన్‌మెన్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మునగాల మండల న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు. రాత్రి వేళల్లో కోర్టు కాపలాకు సెంట్రింగ్‌ని నియమించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Similar News

News March 24, 2025

మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు…!

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. హవేలిఘనపూర్, రేగోడ్ 36.6, అల్లాదుర్గ్ 36.5, పాపన్నపేట్ 36.4, కౌడిపల్లి, టేక్మాల్ 36.0, పెద్దశంకరంపేట్ 35.9, మెదక్ 35.8, నర్సాపూర్, వెల్దుర్తి 35.3, కుల్చారం 34.8, శివ్వంపేట, మనోహరాబాద్ 34.7°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News March 24, 2025

రాజ్యాంగ మార్పు: DK, రాహుల్‌పై మండిపడ్డ BJP

image

కాంగ్రెస్ నేత DK శివకుమార్‌ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై BJP మండిపడుతోంది. ‘ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని DK అంగీకరించారు. ఆ పార్టీ రాజ్యాంగానికి పెద్ద ముప్పు. అది అంబేడ్కర్, SC, ST, OBC వ్యతిరేకి’ అని షెజాద్ విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు జాతీయ ప్రయోజనం కన్నా ముస్లిముల బుజ్జగింపే ప్రధానం. రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఎక్కడ’ అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.

News March 24, 2025

వనపర్తి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాలలకు తీరని అన్యాయం’

image

రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి మాలలకు సంక్షేమ పథకాల్లో, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో తీరని అన్యాయం జరిగిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు అన్నారు. మాలలకు ప్రతి సంక్షేమ పథకంలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు వినతి పత్రం అందించారు. మద్దిలేటి వెంకటేశ్, కురుమూర్తి, కరుణాకర్ పాల్గొన్నారు.

error: Content is protected !!