News February 3, 2025

సూర్యాపేట: సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. మొదటి సారి సీసీ కెమెరాలో నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.

Similar News

News December 6, 2025

సిద్దిపేట: అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన శ్రీదేవి

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట డిగ్రీ కళాశాల విద్యార్థిని అసాధారణ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఏ. శ్రీదేవి ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ హర్డిల్స్‌లో సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ జి. సునీత ప్రత్యేకంగా అభినందించారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు అనిర్విచనీయం: కాకినాడ ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వారు పోలీసు శాఖకు వెన్నెముకలా నిలబడి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

News December 6, 2025

కార్డియాలజిస్టుల నియామకానికి కృషి: మంత్రి సుభాష్

image

కాకినాడ GGHలో కార్డియాలజీ విభాగంలో వైద్యుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం ఆయన GGHను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వార్డులను పరిశీలించారు. కార్డియాలజిస్టులు లేని విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.