News February 3, 2025

సూర్యాపేట: సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. మొదటి సారి సీసీ కెమెరాలో నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.

Similar News

News February 8, 2025

క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:DIEO 

image

ఇంటర్‌లో MPHW (ఫీమేల్) కోర్సు ఉత్తీర్ణులైన వారు ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DIEO రవిబాబు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇచ్చే శిక్షణకు ఎంపికైన వారు రూ.వెయ్యి డీడీ అందజేయాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందజేయాలన్నారు.

News February 8, 2025

ఊరుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన సర్వేయర్ బాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కల్వకుర్తి పరిసర గ్రామాలలో వ్యవసాయ భూములు సర్వే చేస్తూ అందరికీ బాల్ రెడ్డి సుపరిచితుడిగా ఉన్నారు. కల్వకుర్తి నుంచి ఇప్పపహాడ్ గ్రామానికి వెళ్తుండగా.. తల తిరిగి కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు.

News February 8, 2025

బాలిక ప్రసవంపై డీఎస్పీ విచారణ

image

భీమిలిలో చదువుతున్న అనకాపల్లి(D) చీడికాడ మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చి KGHలో <<15386000>>ప్రసవించిన సంగతి విదితమే<<>>. నెలలు నిండక ముందే 6 నెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించింది. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి చీడికాడ PSకి బదిలీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు చీడికాడ SI సతీశ్ చెప్పారు. పోక్సో కేసు కావడంతో ఈ కేసును DSP విచారిస్తారన్నారు.

error: Content is protected !!