News March 11, 2025
సూర్యాపేట: 280 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,424 మంది విద్యార్థులకు గాను 7,704 మంది హాజరైనట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. కాగా 280 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు. విద్యార్థులకు తగిన మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Similar News
News November 18, 2025
సీఎం ప్రజావాణిలో 298 దరఖాస్తులు

ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.
News November 18, 2025
జగిత్యాల: 28, 29 తేదీల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో నవంబర్ 28, 29 తేదీల్లో జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అన్ని పాఠశాలల నుంచి 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ను 94402 12333లో సంప్రదించాలన్నారు.
News November 18, 2025
2015 గ్రూప్-2 సెలక్షన్ లిస్ట్ రద్దు: హైకోర్టు

TG: 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై HC కీలక తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో గ్రూప్-2 OMR షీట్ ట్యాంపరింగ్కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను TGPSC ఉల్లంఘించిందని ఇవాళ తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. OMR షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని TGPSCని ఆదేశించింది.


