News April 5, 2025

సూర్యాపేట: 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ

image

సన్న బియ్యం పంపిణీలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సుమారు 65 శాతం దుకాణాలకు తరలించామన్నారు. మిగిలిన 2200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.

Similar News

News October 26, 2025

బాపట్ల: గమనిక.. రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 29వ తారీకు వరకు మొంథా తుఫాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కావున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఎవరు సమస్యలకు సంబంధించిన అర్జీలతో జిల్లా కార్యాలయానికి సోమవారం రావద్దని తెలిపారు.

News October 26, 2025

సూర్యలంక బీచ్ వద్ద బారికేడ్లు

image

బాపట్ల మండలం సూర్యలంక బీచ్ వద్ద ఆదివారం పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బీచ్ ఎంట్రన్స్ వద్ద పర్యాటకులు రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. బీచ్ సందర్శన కోసం వస్తున్న పర్యాటకులను వెనక్కి పంపించేశారు. పర్యాటకుల సందర్శన తాత్కాలికంగా నిషేధించినట్లు సిఐ చెప్పారు.

News October 26, 2025

ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి – మంత్రి అనగాని

image

మొంథా తుఫాన్‌ దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు .రెవెన్యూ, పోలీస్, NDRF బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 27, 28, 29 తేదీలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీరందాటే వరకు సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.