News March 27, 2025
సూర్యాపేట: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం NLG, SRPT, BNGR డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News November 14, 2025
పల్నాడు జిల్లాస్థాయి సీనియర్ జూడో జట్ల ఎంపిక పోటీలు

పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ రావు స్టేడియంలో జిల్లా స్థాయి సీనియర్ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 22, 23 తేదీలలో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి కొప్పుల నరసింహారావు తెలిపారు.
News November 14, 2025
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి: SP

వాంకిడి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎఎస్పీ తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, తదితర విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. SI మహేందర్ను పలు అంశాలపై ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షా చేసి, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు అవసమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.
News November 14, 2025
VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.


