News November 29, 2024

సూళ్లూరుపేటలో రోడ్డు ప్రమాదం..యువకుడు స్పాట్ డెడ్  

image

సూళ్లూరుపేట మండలం కొన్నెంబట్టు గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట నుంచి బైకుపై వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దొరవారి సత్రం మండలం పోలిరెడ్డి పాలెంకు చెందిన ధనుంజయ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు గతంలో వాలంటీర్‌గా దొరవారి సత్రం మండలంలో పనిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

మొదలైన నెల్లూరు DRC మీటింగ్

image

నెల్లూరు జడ్పీ హాల్లో మరికాసేపట్లో జిల్లా సమీక్షా సమావేశం(DRC) మొదలైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో పలు అంశాలపై సమీక్షిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం, ఇరిగేషన్ అంశాలపై చర్చిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. తుపాను నష్టంపై చర్చించి ఈనెల 10న జరిగే మంత్రి వర్గ ఉప సంఘానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.

News November 8, 2025

నెల్లూరులో కీలక సమావేశం.. MLAలు ఏమంటారో?

image

కనుపూరు, గండిపాలెం, స్వర్ణముఖి బ్యారేజి, రాళ్లపాడుతో పాటు సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు సాగునీటి విడుదల చేయాల్సి ఉంది. ఆయా కాలువల్లో గుర్రపు డెక్క తీయలేదు. పెన్నా పొర్లు కట్టల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేజర్ల, అనంత సాగరం, ఆత్మకూరులో రూ.18198 కోట్ల పనులకు అనుమతులు రాలేదు. డేగపూడి, బండేపల్లి కెనాల్ భూసేకరణ పెండింగ్ ఉంది. నెల్లూరులో నేడు జరిగే IAB సమావేశంలో MLAలు వీటిపై ఫోకస్ చేయాల్సి ఉంది.

News November 7, 2025

నెల్లూరు: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

image

మనుబోలు పరిధిలోని భార్య హత్య కేసులో ముద్దాయి రాపూరు శ్రీనివాసులు @ చిన్నోడుకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018 జులై 2వ తేదీ తమ కుమార్తె ప్రేమ వివాహం విషయమై భార్య రాపూరు వెంకటరమణమ్మతో చిన్నోడికి తగాదా జరిగింది. ఆ కోపంతో నెల్లూరు నుంచి KR పురం వెళ్తుండగా మార్గమధ్యలో ఆటోను ఆపి ఆటో జాకీ రాడ్‌తో భార్యపై దాడి చేసి హత్య చేశాడు.