News October 11, 2024

సూళ్లూరుపేట: ఆ 4 షాపులకు ఒక్కో అప్లికేషన్

image

నూతన పాలసీ ప్రకారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో 14 వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు కేవలం 27అప్లికేషన్లే వచ్చాయి. షాపు నంబర్ 175, 182, 183, 187కు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే దాఖలైంది. సాయంత్రంలోగా వీటికి మరెవరూ అప్లికేషన్ పెట్టుకోకపోతే లాటరీ అవసరం లేకుండా వీరికే షాపులు దక్కే అవకాశం ఉంది. అదృష్టాన్ని చెక్ చేసుకోవడానికి ఎవరైనా చివరి నిమిషంలో దరఖాస్తు పెడితే ఇక్కడ లాటరీ తప్పనిసరి.

Similar News

News October 11, 2024

చిల్లకూరులో కన్న తల్లిని కడతేర్చిన కొడుకు

image

కన్న తల్లిని కన్న కొడుకే కడతేర్చిన ఘటన చిల్లకూరు మండలం, కమ్మవారిపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామంలో కాపురముంటున్న సుశీలమ్మ కొడుకు మద్యం తాగొచ్చాడని మందలించింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో కత్తితో కుమారుడు తల్లి తల మీద నరికాడు. వెంటనే గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మహిళ మృతి చెందింది. ఘటనపై చిల్లకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 11, 2024

సింహపురి యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పొడిగింపు

image

విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల గడువును ఈనెల 15వతేదీ వరకు పొడిగించినట్లు వర్శిటీ అడ్మిషన్స్ డైరెక్టర్లు డాక్టర్ హనుమారెడ్డి, డాక్టర్ ఎస్.బి సాయినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందేందుకు ఐసెట్- 2024 క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. మరింత సమాచారం కోసం వీఎస్ యూలోని డీవోఏ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News October 10, 2024

టాటా మృతి దేశానికి తీరని లోటు: మంత్రి నారాయణ

image

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మంత్రి నారాయణ దిగ్ర్భాంతి చెందారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి టాటా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతుని వేడుకున్నారు.