News April 3, 2024

సూళ్లూరుపేట: పెన్షన్ కోసం వచ్చి మహిళ మృతి

image

పెన్షన్ కోసం వచ్చి ఓ మహిళ మరణించిన ఘటన బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… సూళ్లూరుపేట పట్టణం సాయినగర్‌కు చెందిన లలితమ్మ (58) అనే మహిళ పెన్షన్ కోసం మధ్యాహ్నం నుంచి స్త్రీ శక్తి భవనం వద్ద పడిగాపులు కాచింది. పెన్షన్ ఆలస్యం కావడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News October 6, 2024

బంగారు గరుడ వాహనంపై పెంచలస్వామి విహారం

image

స్వాతి నక్షత్రం సందర్భంగా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బంగారు గరుడ వాహనంపై కోన వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు.

News October 5, 2024

బంగారు గరుడ వాహనంపై పెంచలస్వామి విహారం

image

స్వాతి నక్షత్రం సందర్భంగా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బంగారు గరుడ వాహనంపై కోన వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు.

News October 5, 2024

నెల్లూరు: ఏఎంసీల నియామకాలకు సన్నాహాలు

image

ఏఎంసీ పాలకవర్గాల నియామకానికి కసరత్తు మొదలైంది. జిల్లాలో నెల్లూరు సిటీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేపట్టారు. ఛైర్మన్లు, సభ్యుల నియామకానికి వడపోతల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జనసేన, బీజేపీ నేతలు కూడా కొన్ని పదవులు ఆశిస్తున్నారు. కాగా నెల్లూరు రూరల్‌కు సంబంధించి మనుబోలు శ్రీధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది.