News February 7, 2025
సూళ్లూరుపేట హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738883765129_20345978-normal-WIFI.webp)
రోడ్డు ప్రమాదంలో ఐస్క్రీమ్లు విక్రయించే వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేటలో గురువారం రాత్రి జరిగింది. బాలాయపల్లి(మం), గొల్లగుంటకు చెందిన చల్లా వెంకటకృష్ణయ్య ఆటోలో ఐస్ క్రీమ్లు విక్రయించేవాడు. ఆయన ఐస్క్రీమ్ ఆటోలో సూళ్లూరుపేటకు వస్తుండగా ఆర్టీసీ డిపో సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News February 7, 2025
కోడిగుడ్డుపై అపోహలు.. వైద్యులేమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738919104517_746-normal-WIFI.webp)
కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT
News February 7, 2025
కుటుంబంతో రాష్ట్రపతి భవన్ను సందర్శించిన సచిన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738919517073_746-normal-WIFI.webp)
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.
News February 7, 2025
ట్విస్ట్.. టీమ్ఇండియా కెప్టెన్గా హార్దిక్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738911997697_893-normal-WIFI.webp)
టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ODI, T20 కెప్టెన్సీ ఇవ్వాలని BCCI యోచిస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. బాగా రాణిస్తున్నప్పటికీ అతడికి అన్యాయం జరుగుతోందనే భావనలో కోచ్ గంభీర్, బోర్డు అధికారులున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే ODIలకు హార్దిక్ను కెప్టెన్ చేయాలని, T20ల్లో సూర్య బ్యాటింగ్లో విఫలమవుతున్న నేపథ్యంలో ఆ పగ్గాలు కూడా పాండ్యకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.