News March 20, 2025
సెంటర్స్ వద్ద 163 BNSS యాక్ట్ అమలు: SP నరసింహ

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. 67 పరీక్షా కేంద్రాలలో 11,912 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని సూచించారు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలన్నారు.
Similar News
News November 6, 2025
జీతాల కోసం ఎదురుచూపు: ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం కొన్ని శాఖలకు మాత్రమే చెల్లింపులు జరిగాయని, రెవెన్యూ, దేవాదాయం వంటి కీలక శాఖల అధికారులకు కూడా జీతాలు విడుదల కాలేదని కాకినాడ జిల్లా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఒకటో తేదీనే ఇస్తామని చెప్పినా కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో, తాము బ్యాంకు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల మోటార్ సైకిళ్లు

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్తో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆ శాఖ జిల్లా మేనేజర్ రామ్ కుమార్ బుధవారం తెలిపారు. అర్హత గల 18 నుంచి 45 ఏళ్ల వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు, ఇతర పత్రాలను నవంబర్ 25లోగా ఏలూరు కార్యాలయంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు.


