News August 24, 2024

సెంటు భూమి కూడా ఆక్రమణ కాకూడదు: విశాఖ కలెక్టర్

image

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూ పరిరక్షణ జిల్లా స్థాయీ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆక్రమణ కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని 11 దేవాలయాలకు చెందిన భూములు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల ఈఓలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 22, 2026

ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

News January 22, 2026

ఏయూలో పాలన గాడి తప్పిందా?

image

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.

News January 22, 2026

విశాఖ: జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్ మృతి

image

గాజువాక జీవీఎంసీ హాల్లో సమీక్ష జరుగుతుండగా కుప్పకూలిపోయిన సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికారులు, ప్రజాప్రతినిధులు, జోనల్ కమిషనర్ సమక్షంలో సమావేశం జరుగుతుండగా గోవిందరాజు లేచి మాట్లాడే ప్రయత్నంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు మృతి చెందారు.