News September 1, 2024
సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలిగా శబరి

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి కేంద్రంలో మరో కీలక పదవి లభించింది. ఆమెను సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమించారు. దేశ వ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని ఈ బోర్డు పర్యవేక్షిస్తుంటుంది. ఈమెతో పాటు మహారాష్ట్రలోని దూలే ఎంపీ డాక్టర్ బచావ్ శోభా దినేశ్ను సభ్యురాలిగా కేంద్రం నియమించింది. దీంతో బైరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News July 8, 2025
ఆదోని: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
News July 7, 2025
కర్నూలు: నీటి పారుదల సలహా మండలితో కలెక్టర్ సమావేశం

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ (2025-26) పంటలకు నీటి విడుదలకు సంబంధించి జిల్లా నీటి పారుదల సలహా మండలితో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నీటి కొరత ఉండకుండా చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, జేసీ,సబ్ కలెక్టర్ ఉన్నారు.
News July 7, 2025
ఆదోని: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.