News March 13, 2025
సెకండియర్ పరీక్షకు 299 మంది గైర్హాజరు: కలెక్టర్ తేజస్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా బుధవారం ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7,616 మంది విద్యార్థులకు గాను 7,317 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 299 మంది గైర్హాహరైనట్లు వెల్లడించారు.
Similar News
News February 9, 2026
కృష్ణా: ‘ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి’

జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో RBI ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు.
News February 9, 2026
దుర్శేడు మండల పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ (R) మండలం దుర్శేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, గోపాలపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో ఆమె గణితం, ఆంగ్ల పాఠాలు చదివించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీకి సంబంధించిన మోడల్ టెస్ట్ పేపర్లలోని పలు ప్రశ్నలను అడుగుతూ విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు తరచూ మాక్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
News February 9, 2026
కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


