News March 19, 2025
సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
Similar News
News December 4, 2025
GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News December 4, 2025
టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.
News December 4, 2025
జమ్మికుంట: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది. తనుగుల గ్రామానికి చెందిన జక్కే రజినీకాంత్(29) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి చిన్నతనంలో మరణించగా ట్రాక్టర్ నడుపుతూ కుటుంబపోషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కోసం చేసిన అప్పులు తీరక మనస్తాపానికి గురైన రజినీకాంత్ బుధవారం ఉదయం బిజ్జిగిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.


