News March 19, 2025
సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
Similar News
News October 23, 2025
కోహ్లీ ఎదుట అరుదైన రికార్డ్

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా రేపు టీమ్ ఇండియా రెండో వన్డే ఆడనుంది. విరాట్ మరో 25 రన్స్ చేస్తే ఈ వేదికగా 1000 ఇంటర్నేషనల్ రన్స్ పూర్తి చేసుకున్న తొలి విదేశీ ఆటగాడు అవుతారు. అడిలైడ్లో 6 వన్డేల్లో ధోనీ 262 రన్స్ చేశారు. కోహ్లీ మరో 19 పరుగులు చేస్తే MSD రికార్డునూ బద్దలు కొడతారు. ఇక్కడ 4 వన్డేలాడి కోహ్లీ 244 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లోనైనా విరాట్, రోహిత్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 23, 2025
రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం మునీర్కు ఇష్టం లేదు: ఇమ్రాన్ ఖాన్

సైనిక బలంతో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడని PAK ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్పై ఆ దేశ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. చట్టబద్ధ పాలన, న్యాయం, రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం ఆయనకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు లేకుండా ఏ దేశమూ బలోపేతం కాదని చెప్పారు. తనను జైల్లో ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. AFGతో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
News October 23, 2025
సిరిసిల్ల: ‘అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం’

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్లలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీఐ కృష్ణ, ఆర్ఐ యాదగిరి, ఎస్సైలు శ్రవణ్, దిలీప్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.