News August 17, 2024

‘సెప్టెంబర్ 6న ఛలో హైదరాబాద్.. బీసీ కులగణన మార్చ్’

image

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఛలో హైదరాబాద్ పేరుతో బీసీ కుల గణన మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 14, 2025

జూబ్లీ కౌంటింగ్: దద్దరిల్లనున్న హైదరాబాద్

image

రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన ఫలితం నేడు వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజేత ఎవరు? అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ వైపు చూపినా.. కొన్ని సర్వేలు BRSకు అనుకూలంగా వచ్చాయి. ఇవి ఎగ్జాక్ట్ కాకపోయినా పోలింగ్‌లో సైలెంట్ ఓటింగ్ కీలకంగా మారింది. మధ్యాహ్నం లోపు విజయం తేలనుండడంతో సంబరాలకు శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఎవరు గెలిచినా నగరం హోరెత్తనుంది.

News November 14, 2025

HYD: ఉ.11.30 గంటల్లోపే విజేతపై క్లారిటీ!

image

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనుండగా మొదటి గంటన్నరలోపే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాత EVMలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉ.11.30లోపు విజేత ఎవరో క్లారిటీ రావొచ్చని అంచనా. గెలుపుపై అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష BRS ధీమా ఉండగా పట్టు నిలుపుకునేందుకు BJP చూస్తోంది.

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్ జరిగేది ఇలాగే!

image

మరో 2 గంటల్లో జూబ్లీహిల్స్ కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మొదట షేక్‌పేట డివిజ‌న్ నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత వెంగ‌ళ్‌రావున‌గ‌ర్, ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్, యూసుఫ్‌గూడ‌, సోమాజిగూడ‌, బోర‌బండ‌, ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్ల ఓట్ల లెక్కింపుతో పూర్తికానుంది. షేక్‌పేట్‌-31,182, రహమత్‌నగర్-40,610, బోరబండ-29,760, ఎర్రగడ్డ-29,112 అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి బస్తీ ప్రజలే అభ్యర్థి విజయంలో కీలకంగా మారనున్నారు.