News October 7, 2024

‘సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనానికి తీర్మానం’

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్‌లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.

Similar News

News October 7, 2024

విశాఖ: ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న హోంమంత్రి

image

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అనిత పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు హోం మంత్రి తెలిపారు.

News October 7, 2024

అనకాపల్లి: కలెక్టరేట్ పరిష్కార వేదికకు 232 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సంస్థలపై 232 అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News October 7, 2024

ఆరిలోవ: పసికందు అదృశ్యం.. కేసు ఛేదించిన పోలీసులు

image

ఆరిలోవ రామకృష్ణాపురంలో పసికందు అదృశ్యం ఘటనను ఆరిలోవ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆరిలోవ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వలన పసికందు అమ్మమ్మ వాళ్ల బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో పసికందును కుక్క లాక్కుని పోయిందని జరిగిన హై డ్రామాకు తెరపడింది.