News March 6, 2025
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: బాపట్ల కలెక్టర్

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగం లేకుండా పంటలు సాగు చేయాలని కలెక్టర్ అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తేనే ప్రజల ఆరోగ్యం కాపాడగలమన్నారు.
Similar News
News December 2, 2025
పుతిన్ పర్యటన.. ఈ విషయాలు తెలుసా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు రానున్నారు. ఆయన ఇక్కడ ఉన్నంతసేపు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. తినేందుకు ఆహార పదార్థాలు, నీరు, ఇతర వస్తువులు రష్యా నుంచే తీసుకొస్తారు. క్రెమ్లిన్ చెఫ్ వండిన ఆహారాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తారు. టాయ్లెట్నూ అక్కడి నుంచే తెచ్చి, మలమూత్రాలను తీసుకెళ్తారు. ఆయన ఫోన్ వాడరు. ప్రత్యేకమైన బూత్ నుంచే టెలిఫోన్లో మాట్లాడుతారు.
News December 2, 2025
కాంతార వివాదం: క్షమాపణలు చెప్పిన రణ్వీర్ సింగ్

కాంతార ఛాప్టర్-1 విషయంలో తలెత్తిన <<18445119>>వివాదంపై<<>> బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఆ చిత్రంలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడం మాత్రమే నా ఉద్దేశం. అలాంటి సీన్ చేయడం ఎంత కష్టమో ఓ నటుడిగా నాకు తెలుసు. ప్రతి సంస్కృతి, సంప్రదాయాన్ని నేను గౌరవిస్తా. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
News December 2, 2025
మహబూబ్నగర్: జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.


