News January 31, 2025

‘సేఫ్టీ అవేర్నెస్’ ప్రారంభించిన HYD ఇన్‌ఛార్జ్ మంత్రి

image

సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. HYDలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షించాలన్నారు.

Similar News

News February 17, 2025

గ్రేటర్ HYD పార్కుల్లో CCTV కెమెరాలు

image

గ్రేటర్ HYD పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే అసలు అడ్డూ అదుపు లేకుండా పోతుందంటున్నారు. కాగా వీటికి అడ్డుకట్ట వేసేందుకు తొలివిడతగా 7 పార్కులను ఎంపిక చేసి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని HMDA టెండర్లను ఆహ్వానించింది. కాంట్రాక్టర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను రెండేళ్ల పాటు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News February 16, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

News February 16, 2025

HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!