News June 24, 2024
సైకిల్పై పార్లమెంటుకు విజయనగరం MP

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేడు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని అతిథి గృహం నుంచి సైకిల్పై పార్లమెంట్కు బయలుదేరారు. ముందుగా ఆయన తన తల్లికి పాదాభివందనం చేసి పార్లమెంటుకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు హాజరయ్యారు.
Similar News
News January 6, 2026
SKLM: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు..మూడు రోజులే ఛాన్స్

శ్రీకాకుళం జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పోస్టులకు విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. లావేరు, పొందూరు, పోలాకి, జలుమూరు, పాతపట్నం, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురంలో మండలాల్లో మొత్తం 15 ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. JAN6- 8తేదీల లోపు ఆయా స్కూల్స్కు దరఖాస్తులను అందజేయాలని DEO రవిబాబు పేర్కొన్నారు. రూ.12 వేలు వేతనం ఇవ్వనున్నారు.
News January 5, 2026
టెక్కలి: 10 సార్లు సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి మృతి

టెక్కలి మండలం పెద్దసానకు చెందిన కోట చిన్నబాబు (103) సోమవారం మృతిచెందారు. గ్రామానికి చెందిన చిన్నబాబు సుమారు 50 ఏళ్లు (10 సార్లు) గ్రామ సర్పంచ్గా పని చేశారు. అంతే కాకుండా ఒక విద్యా సంస్థల ఛైర్మన్గా.. రైతు సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖులు నివాళులు అర్పించారు.
News January 5, 2026
శ్రీకాకుళం: యాక్టివ్ మోడ్లోకి ఆ సీనియర్ నేత..పొలిటికల్ గేమ్కేనా!

2024 ఎన్నికలనంతరం రెండేళ్లుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మౌనంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కూటమిని విమర్శించ లేదు. అయితే ఇటీవల పలు సమావేశాల్లో పక్కా లెక్కలతో మాట్లాడి యాక్టివ్ మోడ్లోకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ధర్మాన ప్రసాద్కు ఉంది. ఈ సీనియర్తోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి నుంచి పార్టీ బలోపేతానికి వ్యూహం రచిస్తారని అంతర్గత చర్చ సాగుతోంది.


