News March 31, 2025

సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

image

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 18, 2025

సంగారెడ్డి: ‘చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి’

image

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. పోషణ మాసోత్సవాలలో భాగంగా సంగారెడ్డి మండలం అంగడిపేట అంగన్వాడీ కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతోనే పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

News September 18, 2025

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి తదితర జిలాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.

News September 18, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 83,761 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తెలిపారు. ప్రస్తుతం 29,512 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా, మరో 259 మెట్రిక్ టన్నులు రానున్నాయని చెప్పారు. ఎరువుల కొరత లేదని స్పష్టం చేస్తూ, రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దన్నారు. పంటలకు తగిన మోతాదులపై గ్రామ స్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.