News March 31, 2025

సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

image

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 1, 2025

అడ్రియాల ప్రాజెక్ట్‌లో 0.14L టన్నుల బొగ్గు ఉత్పత్తి

image

అక్టోబర్ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను శనివారం RG- 3 పరిధిలోని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం కొలిపాక నాగేశ్వరరావు వెల్లడించారు. లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌కు నిర్దేశించిన 1.63 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.14 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించేందుకు ఉద్యోగులు కట్టుబడి పనిచేయాలని జీఎం సూచించారు.

News November 1, 2025

ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

image

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

News November 1, 2025

ములుగు: యువకులకు గన్ ఎక్కడిది..?

image

ములుగు జిల్లాలో గన్‌తో యువకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ముగ్గురు యువకులను వరంగల్ టాస్క్ ఫోర్స్ టీం అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుల వద్ద ఉన్న గన్ ఒరిజినలేనా..? దాన్ని ఎవరూ ఇచ్చారు. వాళ్లు ఎరిరెవరిని బెదిరించిచారు..? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.