News November 3, 2024

సైదాబాద్: సైబర్ నేరాలకు సెంటర్ పాయింట్ ఆ దేశాలే!

image

సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా తదితర దేశాల కేంద్రంగా హైదరాబాద్‌లో నేరగాళ్లు సైబర్ మోసాలు చేస్తున్నారు. సైదాబాద్, ఎల్బీనగర్, పాతబస్తీ, చార్మినార్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు సైబర్ మోసాలకు బలయ్యారు. పెట్టుబడులు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఫెడెక్స్ మాయలతో కొట్టేసిన డబ్బు, సొమ్మును నిల్వ ఉంచేందుకు ఇండియన్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు.

Similar News

News September 16, 2025

HYD: పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? తనిఖీలు..!

image

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ వ్యవహారం సిటీలో కలకలం రేపింది. ప్రైవేట్ స్కూళ్లలో దందా జరుగుతోంటే అధికారులు ఏం చేస్తున్నారో? సిటీలో అసలు ప్రైవేట్ బడులను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చాం.. అయిపోయింది.. అసలేం జరుగుతోందనే విషయం ఆలోచించడం లేదు. అందుకే ఈ దౌర్భాగ్యం అని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం అంటారు?

News September 16, 2025

HYD: అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్!

image

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని HYD లక్డీకపూల్‌లోని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారని సమాచారం. OCT 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ఈ సంఘం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా వారు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

News September 16, 2025

ఓయూ: 22 నుంచి నూతన కోర్సు ప్రారంభం

image

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ది సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రెయినింగ్‌(సెల్ట్‌)లో ‘ఇంగ్లిష్‌ కమ్యునికేషన్‌ స్కిల్స్‌& పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌’ కోర్సు ప్రారంభిస్తున్నారు. తరగతులు సా.6 నుంచి 7:30 గంటల వరకు ఉంటాయి. ఆసక్తిగల వారు ఈ నెల 20లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సెల్డ్‌ డైరెక్టర్‌ ప్రొ.సవీన్‌ సౌద తెలిపారు. 7989903001 నంబరుకు ఫోన్‌ చేయొవచ్చు.
# SHARE IT