News November 3, 2024

సైదాబాద్: సైబర్ నేరాలకు సెంటర్ పాయింట్ ఆ దేశాలే!

image

సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా తదితర దేశాల కేంద్రంగా హైదరాబాద్‌లో నేరగాళ్లు సైబర్ మోసాలు చేస్తున్నారు. సైదాబాద్, ఎల్బీనగర్, పాతబస్తీ, చార్మినార్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు సైబర్ మోసాలకు బలయ్యారు. పెట్టుబడులు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఫెడెక్స్ మాయలతో కొట్టేసిన డబ్బు, సొమ్మును నిల్వ ఉంచేందుకు ఇండియన్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు.

Similar News

News November 15, 2025

HYD: నలుగురు మహిళా అభ్యర్థులకు ఎన్ని ఓట్లంటే..?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా BRS అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. బరిలో నిలిచిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు సునీతకు రాగా.. మరో అభ్యర్థి అస్మా బేగంకు 107 ఓట్లు, షేక్ రఫత్ జహాన్‌కు 52, సుభద్రారెడ్డికి 50 ఓట్లు పోలయ్యాయి. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో KCRపై సుభద్రారెడ్డి పోటీ చేయగా గజ్వేల్‌లో 721 ఓట్లు వచ్చాయి.

News November 15, 2025

జూబ్లీహిల్స్: రూట్ మార్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..!

image

కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయనే చర్చ ఏళ్లుగా ఉంది. కానీ 2023అసెంబ్లీ ఎన్నికల నుంచి TGలో ఆ పార్టీ నేతలు రూట్ మార్చారు. కుమ్ములాటలు సర్వ సాధారణమే అయినా ఎన్నికలు వస్తే మాత్రం అందరూ ఏకమవుతున్నారు. సమష్టిగా ఉండి పార్టీని గెలిపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా నేతలంతా కలిసి ప్రచారం చేశారు. వారి మధ్య సమన్వయంలో CM రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.

News November 15, 2025

HYD: అమెరికాలో బాత్రూంలు కడిగే వారికి ఏం తెలుసు?: చిన్నశ్రీశైలం యాదవ్

image

పహిల్వాన్లకు, రౌడీలకు తేడా తెలియకుండా BRS వాళ్లు సన్నాసుల్లా మాట్లాడుతున్నారని నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. HYDలోని వ్యాయామశాలల్లో ఉండే వారిని పహిల్వాన్లు అంటారని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని రౌడీలు అంటారన్నారు. అమెరికాలో బాత్రూంలు కడిగేవారికి HYD సంస్కృతి గురించి ఏం తెలుసు అని KTRపై పరోక్షంగా మండిపడ్డారు.