News January 5, 2025
సైబరాబాద్ను సురక్షితంగా మార్చాలి: CP

ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా ప్రమాణాలు రూపొందించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు సురక్షితంగా నివసించే ప్రాంతంగా సైబరాబాద్ను మార్చాలన్నారు.
Similar News
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
News October 16, 2025
HYD: ఆన్లైన్లో అమ్మాయి.. మోసపోయిన అబ్బాయి!

ఆన్లైన్ డేటింగ్, ఫ్రెండ్షిప్ స్కామ్లో పడ్డ వ్యక్తి రూ.6,49,840 పోగొట్టుకున్నాడు. మలక్పేట్కు చెందిన వ్యక్తి (32)కి డేటింగ్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి కుదురుస్తామని మాట్లాడి కొంత డబ్బు తీసుకుంది. అనంతరం ఓ ఫ్రెండ్షిప్ గ్రూప్లో యాడ్ చేసింది. అందులో ఉన్నవారి సూచనల మేరకు బాధితుడు విడతల వారీగా రూ.6,49,840 చెల్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
News October 16, 2025
జూబ్లీహిల్స్: ఉప ఎన్నికలో కొత్తగా 16 నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 16 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం వెల్లడించారు. నాలుగు రోజుల్లో 46 మంది క్యాండిడేట్లు దరఖాస్తు చేయగా.. మొత్తం 56 నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు.