News September 27, 2024
సైబరాబాద్ కమిషనరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

సైబరాబాద్ కమిషనరేట్ CPO కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, EOW DCP ప్రసాద్, అడ్మిన్ అడిషనల్ DCP రవిచంద్రన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
ట్యాంక్బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్బండ్పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.
News November 26, 2025
HYD: LOVEలో ఫెయిల్.. ఇన్ఫోసిస్ ఉద్యోగి సూసైడ్

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి (26) స్నేహితులతో కలిసి సింగపూర్ టౌన్షిప్లో అద్దెకుంటూ ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో పవన్ తన రూమ్లో ఉరేసుకున్నాడు. స్నేహితులు గమనించి PSకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.
News November 26, 2025
HYD: వెంటాడుతున్న విషసర్పాలు!

హైదరాబాద్ శివారు ఏరియాలను విషసర్పాలు వెంటాడుతున్నాయి. ఘట్కేసర్, ప్రతాపసింగారంలో రక్తపింజర, కొండచిలువలు ప్రత్యక్ష్యమైన ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మొయినాబాద్లోనూ ఇదే భయం పట్టుకుంది. మొన్న మండల ఆఫీస్ సమీపంలో ఒక పామును స్థానికులు పట్టుకున్నారు. వరుస ఘటనలతో ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజల ప్రాణ రక్షణతో పాటు వన్య ప్రాణులనూ కాపాడాలని కోరుతున్నారు.


