News June 23, 2024

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా 292 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 80 కార్లు, రెండు హెవీ వెహికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఐటీ కారిడార్‌లో 182 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారన్నారు.

Similar News

News November 12, 2025

ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

image

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లు సికింద్రాబాద్‌, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.

News November 12, 2025

HYD: పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లే సారూ!

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్‌లో ORR వరకు నిర్వహించిన సర్వేలో పెళ్లిపిల్ల కోసం అనేకులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ, వధువు దొరకడం లేదని యంగ్ ఏజ్ మ్యారేజ్ సర్వే వెల్లడించింది. కాగా.. 3 ఏళ్లలో దాదాపు 45 శాతం మందికి అమ్మాయిలు దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనికి ఉద్యోగం, సంపాదన, సొంతిళ్లు ఇలా పలు కారణాలు ఉన్నాయంది. ఓవైపు పిల్ల దొరకక, మరోవైపు వయసు మీద పడుతుంటే సింగిల్స్‌కు టెన్షన్ పెరుగుతోంది.

News November 12, 2025

HYD: డోర్లు మినహా.. మిగతా చోట్ల గ్రిల్స్ ఏర్పాటు!

image

ప్రమాదల నివారణకు మెట్రో మరో అడుగు ముందుకేసింది. అమీర్‌పేట ఎక్స్‌టెన్షన్ కావడంతో రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో L&T ఆధ్వర్యంలో ప్లాట్ ఫాం వద్ద స్పెషల్ డోర్లు కాకుండా, గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో డోర్ ఓపెన్ అయ్యే ప్రాంతాన్ని ఖాళీగా ఉంచి, మిగిలిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.