News April 1, 2025
సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించండి: SP

జహీరాబాద్ పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలో ఉన్న రికార్డులను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హిస్టరీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
Similar News
News October 22, 2025
BREAKING: HYD: సంపులో పడి చిన్నారి మృతి

RR జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్లో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్, స్వాతి దంపతులు వారి కుమార్తె రక్షిత(18 నెలలు)ను నానమ్మ దగ్గర వదిలి కూలి పనులకు వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మాణంలో ఉన్న సంపులో పడిపోయింది. చిన్నారి చేతిలో ఉన్న పెన్ను సంపులో కనిపించడంతో లోపలికి చూశారు. చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 22, 2025
BREAKING: HYD: సంపులో పడి చిన్నారి మృతి

RR జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్లో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్, స్వాతి దంపతులు వారి కుమార్తె రక్షిత(18 నెలలు)ను నానమ్మ దగ్గర వదిలి కూలి పనులకు వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మాణంలో ఉన్న సంపులో పడిపోయింది. చిన్నారి చేతిలో ఉన్న పెన్ను సంపులో కనిపించడంతో లోపలికి చూశారు. చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 22, 2025
విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి..

పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్ పై గ్రామానికి వెళ్తున్న తండ్రి, కొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య (60), మాదాల వెంకటేశ్వర్లు (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.