News January 30, 2025
సైబర్ క్రైమ్ కేసుల్లో డబ్బులు రిఫండ్ అయ్యేలా చూడలి: ఎస్పీ

ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఫైబర్ క్రైమ్ కేసులదలో బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రిఫండ్ అయ్యే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు రవీందర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
Similar News
News November 9, 2025
బైక్ను ఢీకొట్టిన లారీ..యువకుడి మృతి

ఎస్.రాయవరం మండలం గోకులపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.రంజిత్ (28) మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తలుపులమ్మలోవ నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న రాజేశ్, గణేశ్ గాయపడ్డారు. వీరిని ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వివరాలివే

✒ ఎల్లుండి పోలింగ్, బరిలో 58 మంది అభ్యర్థులు
✒ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు. పోలింగ్ విధుల్లో పాల్గొననున్న 2060 మంది సిబ్బంది
✒ 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా. 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తింపు
✒ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
✒ GHMC ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
✒ ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితం
News November 9, 2025
రేపు క్యాబినెట్ భేటీ.. CII సమ్మిట్పై కీలక చర్చ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII సమ్మిట్ ప్రధాన ఎజెండాగా సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం, పంట నష్టం అంచనాలు, రైతులకు అందించాల్సిన పరిహారంపై చర్చించనున్నారు.


