News January 25, 2025

సైబర్ నేరాలపై అవగాహన అవసరం: పార్వతీపురం ఎస్పీ

image

ఐటీ, సైబర్ సెక్యూరిటీలపై యువతకు అవగాహన అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా వాసులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. OLX, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే నంబర్ 1930ని సంప్రదించాలన్నారు.

Similar News

News November 22, 2025

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్‌లో శ్రద్ధా నటిస్తున్నారు.

News November 22, 2025

జగిత్యాల: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా

image

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం నవంబర్ 24న (ఆదివారం) ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బి. సత్యమ్మ తెలిపారు. కృషి విజ్ఞాన్ హైదరాబాద్‌లో 67, గూగుల్ పేలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ 30 పోస్టులు ఉన్నాయన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు హాజరు కావచ్చు. ఎంపికైన వారు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, చొప్పదండి, ధర్మారం వంటి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

News November 22, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు శనివారం ఇలా ఉన్నాయి. ములకలచెరువులో నాణ్యత గల టమాటా 10 కిలోలు రూ. 520, పుంగనూరులో రూ. 500, పలమనేరులో రూ.490, వీకోటలో రూ.520, కలికిరిలో రూ.510, మదనపల్లెలో రూ. 630 వరకు పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.