News January 25, 2025
సైబర్ నేరాలపై అవగాహన అవసరం: పార్వతీపురం ఎస్పీ

ఐటీ, సైబర్ సెక్యూరిటీలపై యువతకు అవగాహన అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా వాసులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. OLX, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే నంబర్ 1930ని సంప్రదించాలన్నారు.
Similar News
News November 27, 2025
రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలి: కలెక్టర్

జిల్లాలోని రైస్ మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు పూచీకత్తు చెల్లించాలని బాపట్ల కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం
ఆయన కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 74 మిల్లులు ఉండగా, రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలన్నారు. రైతులకు నష్టం లేకుండా ధాన్యం సేకరణ, ప్రతి మిల్లులో తేమ యంత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ ఉందన్నారు.
News November 27, 2025
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.
News November 27, 2025
పాలకుర్తి: నువ్వా? నేనా? అన్నట్లుగా ఎన్నికలు!

పాలకుర్తి నియోజకవర్గంలో జరగబోయే స్థానిక ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని, అత్త ఝాన్సీ రెడ్డిలు సైతం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. ఎవ్వరు తగ్గేది లేదు అన్నట్టుగా ఉండటంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.


