News July 26, 2024
సైబర్ నేరాలపై ‘ప్రకాశం పోలీస్’ విస్తృత అవగాహన

సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజింగ్ యాప్ల ద్వారా పంపిన APK ఫైల్స్ను ఇన్ స్టాల్ చేయడం, అపరిచిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం, ఓటీపీ పంచుకోవడం వంటివి చేయవద్దని గురువారం ఒక ఆసక్తికర పోస్టర్ను విడుదల చేసింది. చెడు వినకు, చూడకు, మాట్లాడకు అనేలా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రజలను ఆలోచింపచేస్తోంది.
Similar News
News November 25, 2025
ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!
News November 25, 2025
కొరిశపాడు: ATMలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న 2 ATMలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ATMలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి కొరిశపాడు(M) రావినూతల గ్రామానికి చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
News November 25, 2025
నేపాల్లో 8 మంది పామూరు యువకులు అరెస్టు

బెట్టింగుల కోసం దేశాలు దాటి పామూరు యువకులు జైలు పాలైన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. నేపాల్ దేశంలో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్పై ఆన్లైన్లో బెట్టింగ్ కాసేందుకు పామూరుకు చెందిన 8 యువకులు బెంగుళూరు నుంచి విమానం ద్వారా నేపాల్కి చేరుకున్నట్లు సమాచారం. నేపాల్కి వెళ్లెందుకు పాస్పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుపై నేపాల్ వెళ్లారు. పోలీసుల పక్కా సమాచారంతో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


