News October 3, 2024

సైబర్ నేరాల కట్టడికి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి: ఎస్పీ

image

కర్నూలులోని ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ జీ.బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొరియర్ అని, లాటరీ తగిలిందని, డిజిటల్ అరెస్టు పేరుతో విడియో కాల్స్ చేస్తూ మోసాలు చేస్తున్నాయని, జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

Similar News

News November 28, 2025

పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటిని డ్రైవ్ మోడ్‌లో క్లియర్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.
లాగిన్‌లో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయంటూ మండల సర్వేయర్, తహశీల్దార్‌లను కలెక్టర్ ప్రశ్నించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 28, 2025

ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

image

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్‌క్వార్టర్‌గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్‌క్వార్టర్‌గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.