News February 7, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ

సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News December 29, 2025
ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు

AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు(నేచురోపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయనతో పాటు పోచంపల్లి శ్రీధర్ రావు(మాస్ కమ్యూనికేషన్)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.
News December 29, 2025
నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: SP

నూతన సంవత్సర వేడుకలను జిల్లాలోని ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. డిసెంబర్ 31న రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
News December 29, 2025
మెల్బోర్న్ పిచ్కు డీమెరిట్ పాయింట్.. నెక్స్ట్ ఏంటి?

యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన <<18689522>>బాక్సింగ్ డే టెస్టు<<>> పిచ్కు ICC ‘అసంతృప్తికరం’ అని రేటింగ్ ఇచ్చింది. రెండ్రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో 142 ఓవర్లలో 36 వికెట్లు పడగా, ఒక్క బ్యాటర్ కూడా కనీసం 50 రన్స్ చేయలేకపోయారు. దీంతో MCGకి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఇది 5Yrs రికార్డులో ఉంటుంది. 6 పాయింట్లు వస్తే ఏడాది పాటు నిషేధం విధిస్తారు. గత ఐదేళ్లలో MCGకి ఇదే తొలి డీమెరిట్ పాయింట్.


