News March 13, 2025

సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్: విశాఖ సీపీ

image

విదేశాలలో చైనాకు సంబంధించిన ఫేక్ కంపెనీలలో పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతోమందిని మోసం చేసి డబ్బులు దోచుకున్న వ్యక్తి విశాఖ పోలీసులకు చిక్కాడు. అనకాపల్లికి చెందిన నిందితుడు చొప్పా ఉమా మహేశ్‌ను సైబర్ పోలీసులు బుధవారం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అనకాపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని విశాఖ సీపీ చెప్పారు.

Similar News

News March 19, 2025

VKB: పరీక్షల నిర్వహణకు అధికారుల నియామకం

image

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలన కోసం పలు అధికారులను నియమించారు. అందులో 20 మంది MROలు, 20 మంది MPDOలు, 20 మంది MEOలు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్, 69 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, 8మంది పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్, 13మంది రూట్ ఆఫీసర్స్, 69మంది సెట్టింగ్స్ స్వీట్స్, 10మంది ఫ్లైయింగ్ స్పాట్స్, 732మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. 

News March 19, 2025

WNP: రేపు జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి

image

వనపర్తి జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ భర్తీకి ఈనెల 20న జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. మొత్తం 400 ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సర్టిఫికెట్స్, బయోడేటా ఫామ్‌తో పట్టణంలోని రామాలయం సమీపాన ఉన్న ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర (PMKK)సెంటర్‌లో హాజరు కావాలన్నారు.

News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!