News July 9, 2024
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: విశాఖ పోలీసులు

నకిలీ ఫోన్లతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఫెడెక్స్ కొరియర్ పేరిట అనేక మందిని మోసం చేశారని, ఈ కొరియర్ పేరిట ఎవరు ఫోన్ చేసినా నమ్మవద్దని సూచించారు. ఫోన్ చేసి మీ ఆధార్పై ఫోన్ నెంబరు రిజిస్టర్ అయిందని, ఈ ఫోన్ ను ముంబయిలో ఒక వ్యక్తి దేశద్రోహానికి పాల్పడే వాటికి ఉపయోగిస్తున్నారని బెదిరింపులకు దిగి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
విశాఖలో హెల్త్ క్యాంప్ను సందర్శించిన సీఎం

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్లో టెస్ట్లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.
News September 17, 2025
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి AU సాగరిక ఫంక్షన్ హాల్కు బయలుదేరింది. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ హెల్త్ క్యాంప్ సందర్శిస్తారు. అనంతరం AU కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించే సభలో పాల్గొంటారు.
News September 17, 2025
విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.