News June 22, 2024
సొంతపార్టీ నేతలే YS షర్మిలపై ఫిర్యాదు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించిందని మండిపడ్డారు.
Similar News
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.


