News February 3, 2025
సోన్: విద్యుత్ షాక్తో ఒకరి మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News November 14, 2025
కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

కామారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ స్కిట్, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్ ప్లెడ్జ్, అలాగే విద్యార్థులకు పోలీస్ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
News November 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 14, 2025
వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


