News March 11, 2025
సోమందేపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

సోమందేపల్లిలోని పాతఊరులో మంగళవారం విద్యార్థిని పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఈడిగ సురేశ్, సుధారాణిల కుమార్తె పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం విద్యార్థి ఇంటిలో ఉరేసుకుని మరణించింది. విద్యార్థి తన చావుకు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు నాన్న అని రాసి ఉన్న లెటర్ను ఎస్ఐ రమేశ్ బాబు, ఏఎస్ఐ మురళి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2026
WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్ల ఫలితాలు WTC pts టేబుల్కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News April 11, 2026
NTR: నేడు 3 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన APSDMA

జిల్లాలో శనివారం 3 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. జి.కొండూరు 44.1, ఇబ్రహీంపట్నం 44.1, కంచికచర్ల మండలాలలో 43.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది.
News April 11, 2026
‘దీపం’ లబ్ధిదారులు PNGకి మారినా రాయితీ ఇస్తాం: CM CBN

AP: దీపం పథకం లబ్ధిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)కి మారినా వారికి ఇచ్చే రాయితీని ఖాతాల్లో జమ చేస్తామని CM CBN వెల్లడించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సమీక్షించిన ఆయన, రాబోయే 6 నెలల్లో 10 లక్షల PNG కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్ను నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఫోన్లో కోరారు.


