News April 11, 2024

సోమల: భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన నిందితురాలి అరెస్టు

image

భర్తను హత్య చేసి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న భార్యను అరెస్ట్ చేసి చిత్తూరు ఏడీజే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు SI వెంకట నరసింహులు తెలిపారు. 2018లో సోమల(M), ఆవులపల్లెకు చెందిన గోవిందప్ప(35)ను భార్య కుమారి, ప్రియుడు వెంకటరమణతో కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చింది. కుమారి రిమాండుకు వెళ్లివచ్చిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు.

Similar News

News March 21, 2025

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో మిథున్ రెడ్డి భేటీ

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం పార్లమెంటు భవనంలో కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఉన్నారు.

News March 21, 2025

పులిచెర్ల: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

News March 21, 2025

14400కు కాల్ చేయండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో సారా నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో నవోదయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సారా తయారీ చేసినా, విక్రయించినట్లు తెలిసినా ప్రజలు 14400 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ మణికంఠ, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!