News January 28, 2025

సోమవారం నుంచి మున్సిపాలిటీగా స్టేషన్ ఘనపూర్

image

అభివృద్ధిలో ముందుకు పోతున్న నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ ఘనపూర్ సోమవారం నుంచి మున్సిపాలిటీగా అధికారికంగా అమల్లోకి వచ్చింది. స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ప్రకటిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కే.శ్రీదేవి నేడు జీవో విడుదల చేశారు. స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, చాగల్లు గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మూడు గ్రామాల జనాభా 23,033గా ఉంది.

Similar News

News November 15, 2025

ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి: MHBD కలెక్టర్

image

ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని, ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా కేంద్రాలను, వసతి గృహాలను పరిశీలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News November 15, 2025

కామారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో రూ.2.74 లక్షల టోకరా

image

టెలిగ్రామ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. ‘గుబిభో’ అనే యాప్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్‌లు చూపించారు. డబ్బు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. దీంతో బాధితుడు రూ.2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.

News November 15, 2025

పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.