News July 28, 2024
సోమిరెడ్డి పై విచారణ జరిపించాలి: కాకాని

సీఎం చంద్రబాబు తమపై విచారణ జరిపించడంతో పాటు, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకుపై కూడా విచారణ జరిపించేందుకు సిద్ధంకావాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. SNJ డిస్టీలరీస్ను సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ ప్రభుత్వంలోనే ఇది ప్రారంభమైందన్నారు. ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని సోమిరెడ్డి తెలుసుకోవాలన్నారు.
Similar News
News November 19, 2025
ఉదయగిరి: బాలికపై యువకుడు లైంగిక దాడి

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం దుత్తలూరు మండలంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికకు కొద్ది నెలల క్రితం వింజమూరుకు చెందిన సాథిక్ అనే యువకుడికి పరిచయమయ్యాడు. ఈక్రమంలో బాలికను ఉదయగిరి దుర్గంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్కి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైందని డాక్టర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేశారు.
News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.


