News November 10, 2024

సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు రెండోసారి వరించిన పదవి

image

కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. 1982 నుంచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2016లో కుడా తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన సేవలను గుర్తించి రెండోసారి కుడా ఛైర్మన్‌గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 17, 2026

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News January 17, 2026

కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

image

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.

News January 17, 2026

కర్నూలు: భార్యను వదిలేసిన టీచర్‌కు రిమాండ్!

image

DSC కోచింగ్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేసిన సంజామల(M) ఆకుమల్లకు చెందిన టీచర్ కలింగిరి మహేశ్‌ను కోవెలకుంట్ల కోర్టు 14రోజుల రిమాండ్‌కు పంపింది. కర్నూలు(D) సి.బెళగల్(M) కంబదహాల్‌కు చెందిన సారమ్మతో రెండేళ్లు సహజీవనం చేసి ఉద్యోగం రాగానే దూరం పెట్టాడు. యువతి ఒత్తిడితో ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేశాడు. దీంతో యువతి సంజామల పోలీసులను ఆశ్రయించింది.